గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా జరగాలని ఫ్లాగ్ మార్చ్

హైదరాబాద్, సెప్టెంబర్ 03, అద్దం న్యూస్ : గణేష్ శోభాయాత్ర నేపధ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్ప వల్లి ఆదేశాల మేరకు చిక్కడపల్లి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు. చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి క్రాస్ రోడ్, అంబేద్కర్ కాలేజీ, సుందరయ్య పార్క్, నాగమయ్య కుంట, హరి నగర్, రిసాలగడ్డ, గోల్కొండ క్రాస్ రోడ్స్ పరిసర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు. ఈ ఫ్లాట్ మార్చ్ లో చిక్కడపల్లి ఏసీపీ రమేష్, చిక్కడపల్లి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్లు రాజు నాయక్, రాంబాబు, డిఐ శంకర్, ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply