కట్టమైసమ్మ దేవాలయంలో గాయత్రిదేవి రూపంలో అమ్మవారు

హైదరాబాద్, సెప్టెంబర్ 24, అద్దం న్యూస్ : దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గాయత్రిదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఛైర్మన్ గోల్కొండ గౌతమ్కుమార్, ఆలయ ఈవో సాంబశివరావు, అర్చకులు సాత్విక్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply