గాంధీనగర్లో ఘనంగా హనుమాన్ జయంతి
వేడుకల్లో పాల్గొన్న
♦ గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ 
వేడుకల్లో పాల్గొన్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, మే 22, అద్దం న్యూస్ : వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి రోజున జరిపే అంజనీ సుతుడు శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలను ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చిక్కడపల్లి వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, ఆర్టిసి క్రోస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలోని శ్రీ హనుమాన్ ఉపాలయం, వివి గిరి నగర్ లోనీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాలలో జరిగిన ప్రత్యేక పూజలకు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయం ఈవో మాచర్ల దేవనాధం, రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ తదితరులు కార్పొరేటర్ పావని ని స్వాగతించి, అర్చకుల ద్వారా స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, శివకుమార్, ఆనంద్ రావు, రఘు యాదవ్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply