నేడు ఆరోగ్య అవగాహన సదస్సు
– ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 11, అద్దం న్యూస్ : నేడు ( శుక్రవారం ) సాయంత్రం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్ర దొడ్డి కొమురయ్య హాల్లో ఆరోగ్య అవగాహన సదస్సు జరుగనుంది. ఈ మేరకు గురువారం బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.శంకర్ ముదిరాజ్, మన్నె దామోదర్రెడ్డి, ఎర్రం చంద్రశేఖర్ లతో కలిసి అవగాహన సదస్సు పోస్టర్ను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహ లను నిర్వాహకులు కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
