చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సికింద్రాబాద్, జూన్ 19, ( అద్దం న్యూస్ ) : గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మతిస్థిమితం లేకుండా ఓ వ్యక్తి పడి ఉండటాన్ని చిలకలగూడ పెట్రో కార్ సిబ్బంది అతనిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే చిలకలగూడ పోలీస్స్టేషన్కు నేరుగా అయినా, చిలకలగూడ ఇన్స్పెక్టర్ 87126 60218, చిలకలగూడ ఏసిపి 87126 61252 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.













Leave a Reply