ఘనంగా నాగులూరి సాయిబాబా జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, మే 5, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ సాయిబాబా సమేత బాల ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ నాగులూరి సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకలగూడలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, అనిల్ కుమార్, శంకర్, సతీష్, ఆంజనేయులు, ప్రమోద్ తదితరులు పాల్గొని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply