తెలంగాణ బ్యూరో, నవంబర్ 26, అద్దం న్యూస్ : జీవో 46 కు విరుద్ధంగా 17 శాతాన్ని బీసీ రిజర్వేషన్లు కేటాయించారని, సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టును ఆశ్రయించారు. బీసీలకు 17 శాతం రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వలేదని, జీవో 46 ప్రకారం అది చట్ట విరుద్ధమని మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు కేవలం 117 మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్నహైకోర్టు న్యాయమూర్తి విచారణను గురువారం ( నేటికి ) వాయిదా వేశారు.![]()

![]()













Leave a Reply