హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ : జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అడిక్మెట్ డివిజన్ బిజెపి కమిటీ ఆధ్వర్యంంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా శనివారం అడిక్మెట్ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు సాయికృష్ణ యాదవ్, ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప్ అభియాన్ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కో-కన్వీనర్ రొయ్యూరు శేషసాయి, బిజెపి నాయకులు వంశీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()
అడిక్మెట్లో వందేమాతరం గీతాలాపన
RELATED ARTICLES

