Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadజలమండలి ఎండీని కలిసిన టీజీవో నాయకులు

జలమండలి ఎండీని కలిసిన టీజీవో నాయకులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   జ‌ల‌మండ‌లి ఎండి అశోక్‌రెడ్డిని గురువారం టీజీవో హైదరాబాద్ జిల్లా నాయకులు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా ఎండి అశోక్‌రెడ్డిని ఆయ‌న ఛాంబ‌ర్‌లో క‌లిసి అభినందనలు తెలిపారు. జలమండలికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణా యాదవ్, సెక్రెటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ లు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ కోశాధికారి రమణ, సరస్వతి, టీజీవో జలమండలి శాఖ కార్యదర్శి చంద్ర జ్యోతి, పేరయ్య, లీగల్ మెట్రాలజీ శాఖ, మల్లికార్జున్ రెడ్డి, వర్క్స్ ఆడిట్ శాఖ ఈసీ సభ్యులు టీజీవో ఇతర నాయకులు పాల్గొన్నారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page