తెలంగాణ బ్యూరో, నవంబర్ 17, అద్దం న్యూస్ : సౌదీలో భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయ్యారు. అందులో హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు.
మృతులు వీరే :
నసీరుద్దీన్ ( 70 ) అతని భార్య అక్తర్ ( 62 ), వీరి రెండవ కొడుకు సలావుద్దీన్ ( 42 ), కూతుర్లు రిజ్వానా బేగం ( 38 ), షబానా బేగం ( 40 ), అమీనా బేగం ( 40 ), సిరాజ్ భార్య సనా బేగం ( 35 ), సలావుద్దీన్ భార్య ఫరానా సుల్తానా ( 37 ), మీహిష్ (10 ), ఉజైర్( 3 ), ఒమేజా ( 5 ), షేక్ జైనుద్దీన్ ( 12 ), రిదా తజీన్ ( 10 ), తస్మియా ( 3 ), ఫాతిమా ( 6 ), ఎండి షాజైన్ ( 2 ), ఉజేబా ( 3 ), అనీష్ ఫాతిమా చనిపోయారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply