నేడు నాబార్డ్ 44 వ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్, జులై 14, అద్దం న్యూస్ : నాబార్డ్ 44 వ వ్యవస్థాపక దినోత్సవం నేడు ( మంగళవారం ) నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయం, సహకారం, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డి.రవి శంకర్ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద గల నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, వివిధ బ్యాంకుల నియంత్రణ అధిపతులు కూడా హాజరవుతారని తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply