అద్దం న్యూస్, వెబ్డెస్క్: దీపావళి (Diwali)కి అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండగను చేర్చారు. దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్లో జరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే, దుర్గా పూజ, గర్బా, కుంభమేళా, యోగా (2016)లతో సహా భారతదేశం నుండి 15 అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ జాబితాలో దీపావళి (Diwali)తో సహా భారతదేశం నుండి మొత్తం 16 అంశాలు స్థానం దక్కించుకున్నాయి (గతంలో 15 అంశాలు ఉంటే, ఇప్పుడు దీపావళితో కలిపి 16). ఈ గుర్తింపు ద్వారా దీపావళి ప్రాముఖ్యత, సాంస్కృతిక విలువ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరుగుతాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply