వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. లక్షా 17 వేల 188 వందల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో దేవనాధం తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పద్మావతి, గణేష్, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply