వివేక్నగర్
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
ముషీరాబాద్, అక్టోబర్ 13, అద్దం న్యూస్ :
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్లో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం ల పర్యవేక్షణలో భక్తులు హాజరై హుండీని లెక్కించారు. ఒక లక్షా 17 వేల 599 రూపాయల ఆదాయంతో పాటు కొంత మంది భక్తులు ఆన్లైన్ ( స్కాన్ ) ద్వారా వచ్చిన 7165 రూపాయల ఆదాయం వచ్చినట్టు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply