ఘనంగా హజ్రత్ బందగి మియాన్ షా-ఎ-ఖాసిం ముజ్తహిద్-ఎ-గిరోహ్ 404 వ ఉర్స్

హైదరాబాద్, జులై 13, అద్దం న్యూస్ : హజ్రత్ బందగి మియాన్ షా-ఎ-ఖాసిం ముజ్తహిద్-ఎ-గిరోహ్ 404 వ ఉర్స్ ఆదివారం ఘనంగా జరిగింది. ముషీరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై దర్గాను సందర్శించారు. జియారత్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాల్ అక్కడి పవిత్ర మందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు హజ్రత్ సయ్యద్ మసూద్ హుస్సేన్ ముజ్తీడి సహబ్ ఖిబ్లా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి, ఎంఎ.జావీద్ ఖాన్, మునావర్ చాంద్, ఇమ్రాన్ ఖాన్, షాహెద్ బాబా, హసన్ ఖాన్, జాఫర్ ఖాన్, సమీర్ హుస్సేన్, అష్పాక్, ఇమ్రాన్ ఖురేషి, సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply