హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపూనగర్ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి 41వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఆలయ కమిటీ సభ్యులు అందోల్ రాజు, మహేష్, సాయి పాల్గొన్నారు.
ఘనంగా రాజరాజేశ్వరి అమ్మవారి 41వ వార్షికోత్సవ వేడుకలు

