అంబర్పేట్, అద్దం న్యూస్ : కాచిగూడ నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తల్లోజు జ్యోత్స్నను తెలంగాణ గౌడ సంఘం జాయింట్ సెక్రెటరీ, కాచిగూడ జమాల్ బస్తీ గౌడ సంఘం అధ్యక్షుడు భీమగౌనీ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ టి.జ్యోత్స్న మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణ కోసం బస్తీ, కాలనీ ప్రజలు, పీస్ కమిటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, కళావతి, సువర్ణ, బి. మహేందర్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, సత్తయ్య గౌడ్, వీరయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply