డ్రైనేజీ పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి
– బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జావీద్ ఖాన్
హైదరాబాద్, డిసెంబర్ 2, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ పఠాన్బస్తీలో కొనసాగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జావీద్ ఖాన్ కోరారు. ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాసీం, జాఫర్ ఖార్, మున్న ఖాన్, మైనారిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ సర్వర్ తదితరులతో కలిసి పైప్లైన్ పనులను జావీద్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జావీద్ ఖాన్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. జలమండలి అధికారులు ఈ డ్రైనేజీ పైప్లైన్ల పనుల్లో వేగం పెంచాలన్నారు.![]()

![]()
