
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి – 2025 సెంట్రల్ కమిటీ మెంబర్గా, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్గా ఎ.వినయ్ కుమార్ నియామకం
హైదరాబాద్, ఆగస్టు 26, అద్దం న్యూస్ : వినాయక చవితి వేడుకల సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్గా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎ.వినయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్సవ సమితి సెంట్రల్ కార్యాలయంలో మంగళవారం ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు ఎం.వైకుంఠం, కార్యదర్శి ఆలె భాస్కర్ రాజ్ నియామక పత్రాన్ని వినయ్ కుమార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ శివాజీ, కో–కన్వీనర్లు మహేందర్ బాబు, శక్తి సింగ్, రాజ్ కుమార్, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply