హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అచ్యుత రమేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ… తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో దళిత విభాగం ఉపాధ్యక్షులుగా పని చేశానన్నారు. తన పై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతకు న్యాయం చేస్తానని తెలిపారు. తనకు టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం రేవంత్రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్కు, దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నగరిగారి ప్రీతమ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply