వైభవంగా ఆషాడ మాస బోనాలు
గోల్నాక, ఆగస్టు 9, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల పండుగకు దేశ, విదేశాలలో మంచి ఆదరణ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి పాక స్వామి అన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం అంబర్పేట నియోజకవర్గం గోల్నాక చర్చి లైన్లోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి బోనం.. భారీ తొట్టెలను సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి, దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఆంధ్రపూ శ్రీనివాస్, స్వాతి, స్వామి కృష్ణ, మహేందర్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply