పులిగిల్ల శ్రీధర్ చారి ఆధ్వర్యంలో
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పులిగిల్ల శ్రీధర్ చారి ఆధ్వర్యంలో ముషీరాబాద్ డివిజన్ శివాలయం చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండ శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ నాయకులు కృపానంద్, జావీద్ ఖాన్, చింటు ( ప్రభాస్ ), దీన్ దయాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply