శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాల వేడుకలకు రావాలని ప్రముఖులకు ఆహ్వానం

హైదరాబాద్, జులై 15, అద్దం న్యూస్ : హైదరాబాద్లోని 400 ఏళ్ల నాటి పురాతన ప్రసిద్ది చెందిన లోయర్ ట్యాంక్బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20వ తేదీన జరుగనున్న బోనాల పండుగ వేడుకలకు హాజరు కావాలని ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ గోల్కొండ గౌతమ్కుమార్, ఆలయ ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకుడు సాత్విక్శర్మలు మంగళవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లను కలిసి బోనాల ఉత్సవాలకు రావాలని ఆహ్వానపత్రికలను అందచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

