ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
అంబర్పేట్, ఆగస్టు 31, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ మూసీ నదిపై అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ మార్గంలో కొత్తగా నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. 400 మీటర్ల పొడవైన ముసారాంబాగ్ బ్రిడ్జిని రూ.52 కోట్లతో నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీ గణేష్, నవీన్ యాదవ్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.













Leave a Reply