అశోక్నగర్లో సుందరీకరణ పనులను పర్యవేక్షించిన
కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, మే 3, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్నగర్ చౌరస్తాలో విభిన్న రంగులతో కళాకృతులు చిత్రీకరించి డివిజన్లోని చౌరస్తాలను సుదరికరించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను శనివారం జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్ తదితరులతో కలిసి కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జిహెచ్ఎంసి సుందరీకరణ పనులను పర్యవేక్షించారు. అధికారులు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కార్పొరేటర్ పావని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బిజెపి నాయకులు శ్రీకాంత్, సురేష్, రాజు, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply