గణేష్ మండపంలో పూజల్లో పాల్గొన్న డిసిపి శిల్పవల్లి

ముషీరాబాద్, సెప్టెంబర్ 03, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్నగర్లో గజానంద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో జరిగిన పూజలకు సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి హాజరయ్యారు. డిసిపితో పాటు చిక్కడపల్లి ఏసిపి రమేష్, చిక్కడపల్లి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్లు రాజు నాయక్, రాంబాబు, ఎస్ఐలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

