డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి
♦ ఎంటమాలజి ఏఈ వనజ
మల్కాజిగిరి, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ : డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని ఎంటమాలజి ఏఈ వనజ అన్నారు. మలేరియా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో సర్కిల్ ఏఈ వనజ ఆధ్వర్యంలో శుక్రవారం సఫిల్గూడ నుంచి ఆనంద్బాగ్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ వనజ మాట్లాడుతూ.. దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని సూచించారు. అనంతరం ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు గురు భూషణ్, నాగేందర్, షోకత్, రామచందర్, ఎండి అబ్దుల్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply