శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22, అద్దం న్యూస్ : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోనే ప్రసిద్ధి చెందిన లోయర్ ట్యాంక్బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో మొదటి రోజైన సోమవారం అమ్మవారిని శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ పూజలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఛైర్మన్ గోల్కొండ గౌతమ్కుమార్ పటేల్, ఆలయ ఈవో సాంబశివరావు లు హాజరయ్యారు. ఆలయ అర్చకులు సాత్విక్ శర్మ తదితర అర్చకుల వేదమంత్రాల ద్వారా పూజలను నిర్వహించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply