విన్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ
హైదరాబాద్, జూన్ 25, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విన్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్ధులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విన్ టెక్ ఫౌండేషన్ నిర్వాహకులు పాపాని హేమంత్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థినీ, విద్యార్ధులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం, విద్యార్ధులకు అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నీలం వేణుగోపాల్ యాదవ్, మనకర్ నందా లాల్, తరుణి, టింకు, సన్నీ, కార్తీక్, విక్రమ్, శ్యామ్, నాగరాజు, శ్రావణ్, సాయి, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply