గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి 

 

గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి 

 

 

సూర్యాపేట, అద్దం న్యూస్ :     మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామానికి చెందిన కీర్తీ, ఉపేందర్ దంపతుల కుమారుడు వివేక్ (20) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో వివేక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాత్ రూంలోకి వెళ్లి గొంతు, చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page