రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని
హైదరాబాద్, మార్చి 21, అద్దం న్యూస్ : రంజాన్ పండుగ వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, మహిళలకు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ మైనారిటీ మోర్చ్ సీనియర్ నాయకులు మొహమ్మద్ మహమూద్, రహమాత్ అలి లను శాలువాతో సన్మానించి వారికి వారి కుటుంబసభ్యులకు మాజీ కార్పొరేటర్ పావని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా డివిజన్ ప్రజలు జరుపుకోవడం అనేది గంగా.. జమున తహేజీబ్ కు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, రాజు, సురేష్ రాజు, నర్సింహ, సాయి కుమార్, నీరజ్, జ్ఞానేశ్వర్, సాయి గౌడ్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply