గణనాథుడికి పూజలు చేసిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, ఆగస్టు 29, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్లో శ్రీ సిద్ది వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు జరిగాయి. గోపి కృష్ణ, వెంకటేష్ ఓం సాయి, కార్తీక్, సన్నీ, వరుణ్, కరుణాకర్, చింటు, విఘ్నేష్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన పూజలకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

