కెసిఆర్ బర్త్ డే సందర్భంగా పండ్ల పంపిణీ
హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ : తెలంగాణ తొలి మాజీ సీఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బర్త్ డే వేడుకలు మంగళవారం ముషీరాబాద్ డివిజన్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు డేగల బిక్షపతి యాదవ్, ఎ.అజయ్ ముదిరాజ్, నాయకుడు సదానంద్ల ఆధ్వర్యంలో బ్రహ్మంగారి గుడి వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పేదలకు పండ్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, శ్రీనివాస్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్రెడ్డి, నాయకులు లక్ష్మణ్ గౌడ్, బాల్రాజ్గౌడ్, గంటల రాజు, కొండా సహదేవ్, మోయిన్, రంగు శ్రీనివాస్, టిల్లు, బియ్యం శ్రీనివాస్, ఉమారాణి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply