Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadహంతకులకు మద్దతు ఇవ్వడం సరికాదు – విహెచ్‌పి రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

హంతకులకు మద్దతు ఇవ్వడం సరికాదు – విహెచ్‌పి రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

📰 Generate e-Paper Clip

గోషామ‌హ‌ల్‌, అక్టోబ‌ర్ 21, అద్దం న్యూస్ :   విధి నిర్వహణలో ఉన్న పోలీసును అత్యంత క్రూరంగా హత్య చేసిన సమయంలో స్పందించని మానవ హక్కులు.. ఉగ్రవాదులకు తగు రీతిలో జవాబు ఇచ్చినప్పుడు స్పందించడం అత్యంత దారుణం అని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ‌ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. నేర ప్రవృత్తులకు మరింత ప్రోత్సాహం లభించేలా మానవ హక్కులు మాట్లాడటం చూస్తుంటే.. హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. పోలీసుల ప్రాణాలకు విలువ లేదా అని మానవహక్కులను ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ను అత్యంత ఘోరంగా హత్య చేసి, మరి కొంతమందిని చంపేందుకు ప్రయత్నం చేసిన రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌ పోలీసుల పనితీరుకు నిదర్శనం అని ప్రశంసించారు. ఈ విషయంలో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య పనితీరుపై ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉగ్రవాద జాతికి సంబంధించిన రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌ పోలీసుల సమర్థతకు సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఎంతటి జిహాదీ మూకలకైనా ఇదే రీతిలో జవాబు ఇవ్వాలని పోలీసు యంత్రాంగాన్ని బాలస్వామి కోరారు. హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన వెంబడే రియాజ్ ను ఎన్‌కౌంట‌ర్‌ చేయాలని మొట్టమొదట విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page