Saturday, September 19, 2026
No menu items!
HomeNationalక‌విత రాజీనామాకు ఆమోదం తెలిపిన మండ‌లి చైర్మ‌న్‌

క‌విత రాజీనామాకు ఆమోదం తెలిపిన మండ‌లి చైర్మ‌న్‌

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్‌, వెబ్ డెస్క్ :   నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క‌ల్వ‌కుంట్ల‌ కవిత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ జి.సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కవిత తన రాజీనామాను సమర్పించడంతో ఆమె బిఆర్‌ఎస్ నుండి సస్పెండ్ అయ్యారు, కానీ ఆమె అభ్యర్థన మంగళవారం వరకు పెండింగ్‌లో ఉన్న‌ది. సోమవారం, కవిత కౌన్సిల్‌లో ఇదేనా నా చివ‌రి ప్ర‌సంగం అంటూ కంట‌త‌డి పెట్టారు. తన రాజీనామాను ఆమోదించమని మళ్ళీ అభ్యర్థించారు. ఈ నేప‌ధ్యంలో మండ‌లి చైర్మ‌న్ జి.సుఖేంద‌ర్‌రెడ్డి మంగ‌ళ‌వారం  క‌విత రాజీనామాను ఆమోదించారు. సోమ‌వారం మండ‌లిలో చివ‌రి ప్ర‌సంగం త‌ర్వాత గ‌న్‌పార్క్ వ‌ద్ద గ‌ల అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌కు వెళ్లి తాను రాజ‌కీయ పార్టీని పెట్ట‌బోతున్న‌ట్లు క‌విత ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాల‌యానికి ఉద్య‌మ‌కారులు, ఉద్యోగులు, ప్ర‌జాకుల సంఘాల‌, యూనివ‌ర్శిటీ విద్యార్థులు, వివిధ సంఘాల వారు మ‌ద్ద‌తు తెలిపారు. ఆమె మ‌ద్ద‌తుదారుల‌తో జాగృతి కార్యాల‌యం కిక్కిరిసిపోయింది. సామాజిక తెలంగాణ సాధ‌న కోసం న‌డుద్దామ‌ని క‌విత పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page