KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కెటిఆర్కు సిట్ నోటీసులు
అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్రావుకు సిట్ ఏడున్నర గంటల పాటు విచారించింది. ఈ క్రమంలో అదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు 160 CRPC కింద నంది నగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. కెటిఆర్ ను శుక్రవారం ( నేడు ) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణ ఉంటుందని.. సిట్ అధికారులు తెలిపారు.![]()













Leave a Reply