భరత్నగర్లోని మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్లను వేయండి
– అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

భరత్నగర్లో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : భరత్నగర్లోని మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్లను వేయాలని జలమండలి అధికారులను ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్ భరత్నగర్లో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. బస్తీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని, నూతన డ్రైనేజీ పైప్లైన్లు వేయాలని బస్తీవాసులు పలువురు ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ స్పందించి వీలైనంత త్వరగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని వాటర్వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఎ.జావీద్ ఖాన్, మోయిన్, దీన్దయాల్రెడ్డి, క్రాంతి, సదా, పరుశురామ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వీరేష్, బస్తీవాసులు స్వప్న, అనిత, లక్ష్మీ, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply