హైదరాబాద్ వేదికగా ప్రారంభ‌మైన Miss World – 2025

 

హైదరాబాద్ వేదికగా ప్రారంభ‌మైన Miss World – 2025

 

మిస్ వరల్డ్ – 2025 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రప్రంచ సుందరీమణులు

మిస్ వరల్డ్ – 2025 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రప్రంచ సుందరీమణులు

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :     హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ – 2025 ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి Miss World -2025 కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనట్టు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు.

తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్ ప్రారంభం కాగా, 110 దేశాలకు చెందిన ప్రతినిధులు ర్యాంప్ పై ప్రదర్శనగా వచ్చారు. చివరలో మిస్ ఇండియా నందిని గుప్తా త్రివర్ణ పతాకంతో కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అండగా, వారి ధైర్య సాహసాలకు నిర్వాహకులు సెల్యూట్ ప్రకటించారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా లంబాడా కళాకారులు డప్పు, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచంలోనే ఒకటైన పురాతన కళగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page