ఆర్కె కన్వెన్షన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, మార్చి 29, అద్దం న్యూస్ : అడిక్మెట్ డివిజన్ జెడ్బి గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కె కన్వెన్షన్ ఆదివారం రాత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై నిర్వాహకుడు రహీముల్లా ఖాన్తో కలిసి ఆర్కె కన్వెన్షన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ జహంగీర్, మహ్మద్ ఖదీర్, రవి యాదవ్, మునావర్ చాందర్, జావీద్ ఖాన్, అబ్బు, హరీష్, అస్లం, గురుదీప్, బషీర్, మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ యాదవ్, తిరుమల్ రావు, ఖాజా తదితరులు పాల్గొన్నారు. ![]()

![]()












Leave a Reply