హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : హిమాయత్నగర్ మండలం పరిధిలోని కవాడిగూడ డివిజన్కు చెందిన నలుగురు లబ్దిదారులకు మంజూరైన షాదీ ముబారక్ చెక్కులను బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందచేశారు. హిమాయత్నగర్ తహశిల్థార్ సంధ్యారాణితో కలిసి లబ్దిదారులకు చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇన్చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కవాడిగూడ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యామ్, సాయికృష్ణ, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply