నాంపల్లి దర్గాలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రార్థనలు

నాంపల్లి, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏఇయాఖాన్ గౌస్ ఆధ్వర్యంలో నాంపల్లి దర్గాలో గురువారం ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై దర్గాలో చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముఠా జైసింహా, అబ్దుల్ సోహైల్, ఎండి.జావీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి, ఖాదిల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply