హైదరాబాద్, నవంబర్ 21, అద్దం న్యూస్ : ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్కు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గుడిగె శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి షిమా యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గంగనబోయిన రవి యాదవ్, గ్రేటర్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎడ్ల కిరణ్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ తదితరులు శుక్రవారం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలను అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply