
వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న గీతా మూర్తి, సంతకం చేస్తున్న గీతామూర్తి
అంబర్పేట్, మే 19, అద్దం న్యూస్ : వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కో – రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి అన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో గీతా మూర్తి పాల్గొని జమిలి ఎన్నికలకు మద్దతుగా సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించినప్పుడే ఖర్చులు, సమయం ఆదా అవుతాయన్నారు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, మొన్న ఎమ్ఎల్సి ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ఈ సంవత్సరం కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని, వీటి వల్ల ఖర్చు, సమయం వృధా అవుతుందని వివరించారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక పద్ధతి ఉండాలని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమిలి ఎన్నికలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా లీగల్ సెల్ కన్వీనర్, మేడ్చల్ మల్కాజిగిరి ప్రధాన కార్యదర్శి ప్రసన్న తమ మద్దతును ప్రకటించి సంతకం చేశారు.














Leave a Reply