పద్మారావు నగర్లో థాంకోస్ నాచురల్ ఐస్ క్రీం, కేఫ్ ప్రారంభం
బన్సీలాల్పేట్, మార్చి 6, అద్దం న్యూస్ : పద్మారావు నగర్లో థాంకోస్ బ్రాండ్ పేరుతో ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ కేఫ్ను మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. వేసవిలో ప్రజలు చల్లని పానీయాలను ఎక్కువగా ఇష్టపడతారని, నిర్వాహకులు సరైన నాణ్యత పాటించాలని ఆయన సూచించారు. యజమాని నిఖిల్ కుమార్ మాట్లాడుతూ… థాంకోస్ ఐస్ క్రీమ్స్ అండ్ కేఫ్లో నాచురల్ ఫ్లేవర్స్తో తయారు చేసిన పలు రకాల ఐస్ క్రీమ్లను మొదటి నెలలో 50 శాతం డిస్కౌంట్తో సేవలందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు కుసుమ, నికిత, వేదవ్యాస్, ప్రశాంతి, శ్రీకాంత్, లతా రవి, లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.














Leave a Reply