Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) ఇండిగో విమానాల (Indigo Flights) రాకపోకలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విమాన సర్వీసులు రద్దు కావడం, సమాచారం అందించడంలో ఆలస్యం జరగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

92 విమాన సర్వీసుల రద్దు

ఇండిగో సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. మొత్తం 92 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.

శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు: 43

శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన విమానాలు: 49

ఈ భారీ సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రయాణికుల ఆగ్రహం.. నిరసనలు

ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసులను రద్దు చేయడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, చెక్‌ఇన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత విమానాలు రద్దు అయినట్లు సమాచారం ఇవ్వడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతినడంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక గందరగోళానికి గురయ్యారు. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విశాఖపట్నంపై కూడా ప్రభావం..

శంషాబాద్‌తో పాటు విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport) నుంచి కూడా ఇండిగో సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖ నుంచి మొత్తం 8 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. వీటిలో ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌కు వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రాకపోకల్లో ఏర్పడిన ఈ అంతరాయం వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇండిగో సంస్థ దీనిపై మరింత వివరణ ఇవ్వాల్సి ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page