హైదరాబాద్, నవంబర్ 10, అద్దం న్యూస్ : కార్తీక మాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ దేవునితోటలోని చారిత్రక శ్రీ భవాని శంకర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకాశ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజలకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ రాంబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ మేడి సురేష్, మాజీ చైర్మన్ ఆర్.శ్రీనివాస్, ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply