మద్యం సేవించి వాహనాలను నడిపిన 24 మందికి శిక్షలు, జరిమానాలు
హైదరాబాద్, జూలై 8, ( అద్దం న్యూస్ ) : వాహనాల తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలను నడిపిన 24 మందిని చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి లక్ష 42 వేల 200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 24 మందిలో 14 మందికి జరిమానా, సామాజిక సేవా శిక్షలను, అలాగే రెండోసారి నేరానికి పాల్పడిన 10 మందికి 3 రోజుల పాటు జైలు శిక్ష, జరిమానాలను కోర్టు విధించిందని చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.ఏడుకొండలు తెలిపారు.![]()

![]()













Leave a Reply