దోమలగూడ హనుమాన్ దేవాలయంలో శ్రీ రామనవమి వేడుకలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని దోమలగూడ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పూజలకు ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ మాజీ ఛైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల దేవనాధం, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కెఆర్కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply