సిటీ సెంట్రల్ లైబ్రరీలో
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు
హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో గల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు జరిగాయి. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఈ బోనాత వేడుకలకు ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పద్మజ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనాలను నైవేధ్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు వెంకటేశ్వర్ రెడ్డి, అవినాష్ రావు, వెంకటేష్ యాదవ్, రామ్మోహన్, బొల్లం మహేందర్, కృష్ణారెడ్డి, వరప్రసాద్, పిడి మహేష్, యాదమ్మ, చంద్రకళ, ప్రతిభారెడ్డి, శుక్లా దేవి, జంగారెడ్డి, హరిబాబు, శ్రీనివాసు, జానకి రామ్, సూర్య ప్రకాష్, ముత్యం మహేష్, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు శ్రీకాంత్, రామానుజ రెడ్డి, సుగ్రీవు బాలాజీ, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు దేవేందర్, బుచ్చయ్య, శివయ్య, సుజాత, లలిత, సరస్వతి, గ్రంథాలయ ఉద్యోగులు దాతలు, విశ్రాంతి ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply