గణేష్ పూజలకు హాజరైన టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
ముషీరాబాద్, సెప్టెంబర్ 06, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం లక్ష్మణ్ ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణేష నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గణేష్ మండపాన్ని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా దర్శించుకున్నారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, చిక్కడపల్లి మాజీ కార్పొరేటర్ పి.బాలరాజు గౌడ్, నాగు నగేష్, ఎస్.ప్రకాష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply